5 May, 2026 | 7:02 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

లైట్లు ఏర్పాటు చేయాలి.. ఎంపీడీఏకి వినతి పత్రం

18-09-2025 08:05 PM

కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గణపతి..

నాగలిగిద్ద (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండల కేంద్రంలో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఎంపీడీఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గణపతి మాట్లాడుతూ నాగలిగిద్ద మండల్ గ్రామపంచాయతీలో గత కొన్ని రోజులుగా వీధిదీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దసరా పండగ సమయంలో చుట్టాలు బంధువులు పండగాకి ఇంటికి వస్తారని గ్రామాల్లో 'వీధిలైట్లు లేకపోతే ఇబ్బందులకు గురి అవుతున్నారని కావున వీధి దీపాలు వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో గ్రామపంచాయతీ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామపంచాయతీ కి గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు ప్రభుత్వం విడుదల చేయాలని అన్నారు.