20 March, 2026 | 6:30 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

భార్య భర్తల గొడవలతో మనస్థాపం చెంది భార్య అదృశ్యం

18-09-2025 07:58 PM

మేడిపల్లి (విజయక్రాంతి): భార్యా భర్తల గొడవలతో మనస్థాపం చెంది భార్య అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సాయి నగర్ కాలనీలో నివసించే పర్వతాలు తన భార్య అయిన బాలనాగమ్మ(38) వీరిద్దరి మధ్య చిన్న గొడవల కారణంగా మనస్థాపం చెంది ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇంటికి తిరిగి రాలేదు, ఎక్కడ వెతికిన కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశాడు. భర్త ఇచ్చిన ఫిర్యాదు  మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎవరికైనా బాలనాగమ్మ ఆచూకీ తెలిసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి తెలిపారు.