calender_icon.png 28 June, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు వేదికల నిర్వహణ ఖర్చులు ఏఈఓల జీతం నుండి భరిస్తున్నాం

28-06-2025 07:37:25 PM

అర్హత కలిగిన 700 మంది గ్రాడ్యుయేట్ ఏఈఓ లకు పదోన్నతి కల్పించాలి

రైతు వేదికల ద్వారా ఎరువులను విత్తనాలను రైతులకు పంపిణీ చేయాలి

మునుగోడు,(విజయక్రాంతి):  రైతు వేదిక నిర్వహణ ఖర్చులను ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా విడుదల చేయకపోవడం వలన ఏఈవోల జీతం నుండి భరించడం వల్ల  తీవ్ర ఆర్థిక భారం పడుతుందని గ్రాడ్యుయేట్ ఏఈఓల రాష్ట్ర అధ్యక్షుడు పాలకూరి యాదగిరి గౌడ్(Graduate AEOs State President Palakuri Yadagiri Goud ) అన్నారు. శనివారం తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్  కోదండ రెడ్డిని పాలకూరి యాదగిరి గౌడ్ కలిసి ఏఈవోల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు.

కమిషన్ చైర్మన్ ఏఈఓలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, అదేవిధంగా రైతు వేదికలను శుభ్రపరచుటకు, చూసుకొనుటకు ఒక అటెండర్ ని కేటాయించాలని కోరారు. రైతు వేదికల ద్వారా ఎరువులను విత్తనాలను రైతులకు పంపిణీ చేయాలని, అదేవిధంగా అర్హత కలిగిన 700 మంది గ్రాడ్యుయేట్ ఏఈఓ లకు పదోన్నతి కల్పించాలని అన్నారు. అసంపూర్తిగా ఉన్న రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలని కోదండ రెడ్డికి విన్నవించారు.