28-06-2025 07:31:41 PM
జాజిరెడ్డిగూడెం: వర్షాకాలం సమీపిస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేష్ నాయక్ సూచించారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామ జడ్పీహెచ్ఎస్ లో శనివారం పీహెచ్సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆరోగ్య,రక్త పరీక్షలు జరిపి మందులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం, వేడి ఆహారం తీసుకోవాలని, వీధుల్లో అమ్మే ఆహార పదార్థాలను తినకూడదని సూచించారు.