15 June, 2026 | 10:19 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ప్రజావాణికి 360 అర్జీలు

07-12-2024 02:48 AM

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి):ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 360 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేకాధికారి దివ్య కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకున్నారు.

యువకుడి కల సాకారం 

జనగాం జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం తాటికొండకు చెందిన బాణాల రమేశ్ టెంట్‌హౌస్ ఏర్పాటుకు ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం ప్రయత్నించాడు. అయితే సిబిల్ స్కోర్ లేదని, రుణం ఇవ్వలేమని బ్యాంక్ అధికారులు చెప్పారు. దీంతో రమేశ్ గత అక్టోబర్‌లో ప్రజావాణిలో అధికారులకు విషయం చెప్పి అర్జీ పెట్టుకున్నాడు. ప్రజావాణి అధికారులు బ్యాంక్ వారితో మాట్లాడి రుణం ఇప్పించారు. దీంతో రమేశ్ శుక్రవారం ప్రజాభవన్‌కు వచ్చి రుణం మంజూరు చేయించినందుకు చిన్నారెడ్డి, అధికారి దివ్యకు ధన్యవాదాలు తెలిపారు. తనకు స్వయం ఉపాధికి మార్గం దొరికిందని లబ్ధిదారుడు సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అధికారులు అతడికి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.