13-05-2025 10:27:45 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 732 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షా ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రీక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బి) విడుదల చేసింది. పోస్టులకు మొత్తం 27,101 మంది దరఖాస్తు చేసుకోగా, 24,578 మంది పరీక్ష రాశారు. అభ్యర్థులు https:// mhsrb.telangana. gov.in/MHSRB/ home.htmలో మార్కులు చూసుకోవచ్చని సూచించారు. త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని బోర్డు తెలిపింది.