calender_icon.png 17 June, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిట్రోడా రాజీనామా

09-05-2024 02:16:21 AM

వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నిర్ణయం

రాజీనామా ఆమోదించిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

న్యూఢిల్లీ, మే 8: దక్షిణాది ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శల పాలైన సామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు తన రాజీనామా లేఖ పంపడంతో వెంటనే ఆమోదించారు. ‘మన దేశంలో ఎంతో వైవిధ్యత ఉంది. ఈశాన్య ప్రజలు చైనీస్ పోలికలతో ఉంటారు. పశ్చిమాన అరబ్బుల మాదిరిగా కనిపిస్తారు. ఉత్తరాదిన ఆంగ్లేయుల తరహాలో తెల్లగా ఉంటారు. దక్షిణాది వారు ఆఫ్రికన్లలా ఉంటారు’ అంటూ సామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కాగా, సామ్ పిట్రోడా రాజీనామా విషయంలో ఆయన సొంతంగా నిర్ణయం తీసుకున్నారని పార్టీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ తెలిపారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు సామ్ పిట్రోడా ఆయనకు సలహాదారుగా పనిచేశారు. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చాక మన్మోహన్ సింగ్ ఆహ్వానం మేరకు జాతీయ నాలెడ్జ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చైర్మన్‌గా వ్యవహరించారు. 2009లో ప్రజా సమాచార మౌలిక సదుపాయాల కల్పన విషయంలో మన్మోహన్ సింగ్‌కు సలహాదారుగా పనిచేశారు.