26-06-2025 12:12:37 AM
సోమశిల పర్యటనల్లో మంత్రి జూపల్లి వెల్లడి
నాగర్కర్నూల్, జూన్ 25 (విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమశిల వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టును అద్భుతంగా తీ ర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరు, కలెక్టర్ బదావత్ సంతోష్ తదితరులతో కలిసి సోమశిల, అమరగిరి ద్వీపం, మల్లేశ్వరం, నార్లాపూర్ రిజర్వాయర్, పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
రూ.68.10 కోట్లు మంజూరు: సోమశిల ప్రాజెక్టు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ’సాస్కి’ పథకం కింద రూ.68.10 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నిధులతో బోటింగ్ జెట్టి, కాటేజీలు, స్విమ్మింగ్ పూల్, స్పా, వెల్నెస్ సెంటర్, కేఫ్టేరియా, ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ వంటి ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అందుకు రెండు క్లస్టర్లుగా ఏ ర్పాటు చేశారు.
ఈగలపెంట అరైవల్ జోన్, రివర్ క్రూయిజ్, చెంచు గిరిజన అనుభవాలతో ఒక క్లస్టర్,సోమశిల వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ మరో క్లస్టర్ గా ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ ప్రాంత ఉపాధి అవకాశాలు పెరగనున్నట్లు తెలిపారు.
పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలోనే టెండర్లు పిలిచే ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి: తెలంగాణలోని ముఖ్య పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి జూపల్లిస్పష్టంచేశారు.