calender_icon.png 26 June, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామ మినీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ను స్వాగతిస్తున్నాం

26-06-2025 12:11:33 AM

- గ్రామసభలు త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభించాలి

- సిపిఎం పోరాట ఫలితమే మినీ డిస్ట్రిబ్యూటరీలు

- సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు

భద్రాద్రి కొత్తగూడెం,జూన్ 25(విజయ క్రాంతి); సీతారామ ప్రాజెక్టు పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలను తవ్వడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, గ్రామ సభల ద్వారా భూములు సేకరణ చేస్తామని ప్రకటించడాన్ని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ స్వాగతిస్తుందని, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.సీతారామ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు నిర్మిత వుతుందన్నారు.

ఈ జిల్లాలో నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లా ప్రజానీకానికి, భూములకు నీళ్లు రావాలనే ఆందోళనను, ఉద్యమాన్ని సిపిఎం ప్రారంభించిందని, సి పిఎం ఉద్యమ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన పరిణామన్నారు. సిపిఎం పో రాట ఫలితంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే డిస్ట్రిబ్యూటరీ కెనా ల్స్ తవ్వడానికి తగిన భూమి సేకరణ త్వరగా జరపాలన్నారు.

అందుకు గ్రామసభలు పె ట్టాలని రైతాంగానికి భూములు కోల్పోయే ప్రజలకు వివరించాలని, వారిని చైతన్యం చేసి భూమి సేకరణ చేయాలని అందుకు సి పిఎం శ్రేణులు సహకరిస్తాయన్నారు. భూ ములు కోల్పోతున్న రైతాంగానికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారంగా నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం రూ 382.97 కోట్లు నిధులు కేటాయించినట్టుగా సీతారామ ప్రాజెక్టు డిఈ రాణి ప్రకటి ంచడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. క భూ సేకరణకు ఈ నిధులు సరిపోవన్నారు .

సకాలంలో నిధులు విడుదల చేసి భూమి సేకర ణ చేసి పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. గ్రామసభలు నిర్వహించడం ఎం జాయ్మెంట్ సర్వేలో మొదటి దశలో 41.813 వేల ఎకరాలకు నీరు అందుతుందని, చెరువులు,కుంటలు నింపాలని కోరారు. పలు మండలాలలో ఉన్నటువంటి ఫారెస్ట్ సమస్యను పరిష్కరించకుండా పనులు ప్రారం భిస్తే మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఉన్న మొత్తం భూములకు నీళ్లు ఇవ్వాలని కోరారు.

మొదటిదశ అశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి, సు జాతనగర్, చంద్రుగొండ, చుంచుపల్లి, కొత్తగూడెం, అశ్వరావుపేట, దమ్మపేట మండ లాలకు నీరు చేరుతుందని అధికారులు తెలిపారని, కానీ ఇల్లందు, టేకులపల్లి, కామేపల్లి మండలాల మీదుగా బయ్యారం పెద్ద చెరువుకు నీరు చేరవలసి ఉందని వీటికి సంబం ధించినటువంటి వివరాలు ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ప్రజలకు తెలియజేయడం లేదని ఆరోపించారు.భూసేకరణ వలన భూమి కోల్పోయిన రైతులకు పెరిగిన ధరలకునుగుణంగా తగిన నష్టపరిహారం చెల్లించ కుంటె పోరాటం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే అమ్మగారి పళ్లిలోని రైతాంగానికి నష్టపరిహారం చెల్లించమని కోర్టు తీర్పు చెప్పిన ప్పటికీ నేటి వరకు నష్టపరిహారం ఇవ్వ లేదని, వారికి నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్‌చేశారు.