22 July, 2026 | 8:58 AM

ఎంపీల జాబితాను రాష్ట్రపతి అందజేశాం : ప్రధాని మోదీ

07-06-2024 07:34 PM
న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నకల్లో ఎన్నికైన నరేంద్ర మోదీ, ఎన్డీయే కూటమి నేతలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో శుక్రవారం సాయంత్రం కలిశారు. ఎన్డీఏ మిత్రపక్షాలు మద్దతిచ్చిన తీర్మానాన్ని రాష్ట్రపతికి మోదీ అందజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. దీంతో రాష్ట్రపతి ముర్ము మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతిని ఆహ్వానించినట్లు మోదీ తెలిపారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  "ఆజాదీ కా అమృత్‌ కాల్ ఉత్సవాల తర్వాత తొలి ఎన్నిక జరిగింది.

దేశానికి మరింత సేవ చేసే అవకాశం తమకు మూడోసారి లభించిందని, ఈ అవకాశం ఇచ్చినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేస్తాం. మంత్రిమండలి ఏర్పాటుకు రాష్ట్రపతి సూచనలు చేసినట్లు మోదీ వెల్లడించారు. ప్రమాణ స్వీకారానికి ముందు కొత్త మంత్రుల పేర్లను రాష్ట్రపతికి అందజేస్తామని చెప్పారు. మున్ముందు మరింత బాధ్యత, ఉత్సాహంతో పనిచేస్తామని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.