20 March, 2026 | 7:41 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

నాలుగేళ్ల చిన్నారిపై బాలుడు అఘాయిత్యం

20-03-2026 11:28 AM

ఫోక్సో కేసు నమోదు 

అశ్వారావుపేట,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో(Aswaraopeta) ఓ నాలుగేళ్ల చిన్నారిపై బాలుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబందించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మున్సిపాలిటి పరిధిలోని ఓ వార్డుకు చెందిన ముక్కుపచ్చలారని చిన్నారిని అదే ఇంటికి ఎదురుగా ఉండే 14 ఏళ్ల బాలుడు ఆడిస్తానని బుధవారం ఇంట్లోకి తీసుకెళ్లాడు.

చిన్నారి ఇంటికి వచ్చాక నలతగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆరా తీశారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఒక్కసారిగా హతాసులయ్యారు. ఘటనపై చిన్నారి తాత బాలుడి ఇంటికి వెళ్లి నిలదీయంతో ఎదురుగా దాడికి దిగారు. దీంతో విషయం పూర్తిగా వెలుగులోకి రావటంతో చిన్నారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు బాలుడిపై గురువారం ఫోక్సో కేసు(POCSO Act) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు