2 July, 2026 | 3:01 PM

Breaking News

కాంగ్రెస్ నేతలు తోక ముడిచారు: చేతగానోళ్లు ఎందుకు మాట్లాడాలి?: కేటీఆర్   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

గుట్టకు తీసుకెళ్లి.. బాలికలపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

25-09-2025 11:27 AM

ముగ్గురు యువకులపై పోక్సో కేసు..

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్(Alwal Police Station) పరిధిలో ముగ్గురు యువకులపై పోక్సో(Protection of Children from Sexual Offences) కేసు నమోదైంది. ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు. దైవదర్శనం కోసమంటూ ముగ్గురు బాలికలను ఈ నెల 20 యువకులు యాదగిరిగుట్టకు(Yadagirigutta) తీసుకెళ్లారు. దర్శనం అనంతరం బాలికలను యువకులు లాడ్జీకి తీసుకెళ్లారు. బాలికలను మరుసటిరోజు హైదరాబాద్ లో వదిలి యువకులు పరారయ్యారు. బాలికలు రాత్రంతా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. బాలికల తల్లిదండ్రులు ముగ్గురు యువకులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు యువకులు, లాడ్జి ఓనర్ ను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.