17 April, 2026 | 2:30 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

తండ్రిపై పోక్సో కేసు నమోదు

26-03-2025 10:38 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ఏరియాకు చెందిన ఆకుదారి సతీష్ 8వ తరగతి చదువుతున్న తన 15 ఏళ్ల కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించగా, అడ్డుకోబోయిన భార్యను చేతులు, కర్రతో కొట్టడంతో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడు ఆకుదారి సతీష్ పై పొక్సొ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ... సతీష్ కు అతని భార్యకు గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని నిందితుని పెద్ద కూతురు తనకు పుట్టలేదనే అనుమానంతో ఆమెపై ఎప్పుడు కోపంగా ఉండేవాడని తెలిపారు.

బుధవారం ఇంట్లో పోచమ్మ పండుగ చేసుకుందామని బాధితురాలిని మంగళవారం మధ్యాహ్నం హాస్టల్ నుండి తీసుకువచ్చిన సతీష్ బయటకు వెళ్లి మద్యం తాగి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అడ్డుకోబోయిన భార్యను నిందితుడు కర్రతో కొట్టాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరచినట్లు తెలిపారు. బాధితురాలికి కౌన్సిలింగ్ నిమిత్తం భరోసా సెంటర్ కి పంపించినట్లు తెలిపారు.