15 March, 2026 | 9:54 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

కవి వెంకట్ కు 'అక్షరప్రవీణ జాతీయ ప్రతిభా పురస్కారం'

21-01-2026 07:34 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ కు చెందిన ప్రముఖ పద్యకవి, వ్యాఖ్యాత, సంస్కృతభాషా ప్రచార సమితి ఆదిలాబాదు నిజామాబాదు ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు డా బి.వెంకట్ విజయవాడలో అక్షరప్రవీణ జాతీయ ప్రతిభా పురస్కారమును బుధవారం అందుకున్నారు. శ్రీధర్ శ్రీ కళా వేదిక అంతర్జాతీయ సంస్థ అధ్యక్షులు డా కత్తిమండ ప్రతాప్ కుమార్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీనాగభూషణం, జాతీయ ప్రణాళిక అధికారి డా టి పార్థసారథి, జాతీయ కార్యదర్శిశ్రీ హరికోటి, ప్రముఖ శంఖునాదం ప్రముఖ దంపతులు నరసింహ్మారావు ల చేతుల మీదుగా  అందుకున్నారు.

భారతదేశములోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక,గోవా , మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాలనుండి 360 మందికి పైగా కవులు కవయిత్రులు పాల్గొన్నారని వెంకట్ చెప్పారు.40 సంవత్సరాల సాహిత్య సాంస్కృతిక కళా ఆధ్యాత్మిక విద్యా సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ పురస్కార మును  డా కత్తిమం ప్రతాప్  అందజేశారని ఆయన చెప్పారు. తెలుగు సాహిత్య వైభవం పై చక్కటి సందేశమును ఇచ్చానని చెప్పారు.