calender_icon.png 6 June, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టుడుకుతున్న పీవోకే

03-06-2025 12:00:00 AM

- మూడు రోజులుగా నిరసనలు 

- చైనా రహదారి దిగ్భందం

న్యూఢిల్లీ, జూన్ 2: పాకిస్థాన్ ప్రధాని షె హబాజ్ షరీఫ్ పాలనపై పీవోకేలోని గిల్గిత్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తమని రసన తెలియజేస్తున్నారు. మూడు రోజులు గా పాకిస్థాన్ కలిపే కారకోరం ర హదారిని దిగ్భందించి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఉగ్రవాదులకు పరిహారం చెల్లి స్తు న్న షరీఫ్ ప్రభుత్వం వ్యాపారస్తులకు సా య ం చేయడంలో విఫలమైందని షరీఫ్ పార్టీకి చెందిన నేత పేర్కొన్నారు. ఆదివారం కూడా ఈ నిరసన కొనసాగింది. నిరసనలతో ఈ మార్గంలో భారీ ట్రాఫిక్ ఏ ర్పడింది.

నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వాణిజ్య విధాలను నిరసిస్తూ ఎ గుమతి, దిగుమతిదారులు పెద్ద ఎత్తున స మ్మెలో పాల్గొన్నారు. తమ డిమాండ్లు తీర్చే దాకా ఈ నిరసనను ఇలాగే కొనసాగిస్తామ ని వారు పేర్కొన్నట్టు “డాన్‌” పత్రిక పే ర్కొ ంది. కేవలం గిల్గిత్ నగరం నుంచే కాకు ండా వివిధ ప్రాంతాల నుంచి కూడా నిరసనకారులు పాల్గొని రహదారిని దిగ్భందించారు. ఈ ప్రాంతంలోని స్థానికుల భూములను కబ్జా  చేయడంతో ఈ నిరసన మరింత ఎక్కువయింది. 

పాక్‌న హైవే ముట్టడి

వేలాది మంది నిరసనకారులు పాకిస్థాన్ కారకోరం రహదారిని ముట్టడిం చారు. గత ఆరు నెలల నుంచి చైనాలోని సో స్త్ డ్రై పోర్ట్‌లో కస్టమ్స్ క్లియరెన్సెస్ బంద్ చే యడం కూడా ఈ నిరసనకు ఓ కారణం. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 257 కంటైనర్లు చైనా ఓడరేవులో చిక్కుకుపోయాయని నిరసన చేస్తున్న వ్యాపారులు ఆరోపించారు. 

సొంతనేతే విమర్శించిన వేళ.. 

నవాజ్‌షరీఫ్ నేతృత్వంలోని పీఎంల్(ఎన్) ప్రభుత్వాన్ని స్థానిక పీఎంఎల్ (ఎన్) నాయకుడు జావేద్ హుస్సేన్ తీవ్రంగా విమర్శించారు. ‘చట్ట సభల్లో తగినంత మంది ప్రా తినిధ్యం లేకపోవడం పీవోకేలో వివక్షతను తెలు. పాక్ ప్రభుత్వం కరుడుగట్టిన ఉగ్రవాదులకు కూడా క్షమాభిక్ష పెట్టింది. పన్నులు చెల్లించిన తర్వాత ఈ ప్రాంతానికి చెందిన వారి సరుకులను వదిలేయడం పెద్ద డిమాండ్ కాదు.’ అని పేర్కొన్నారు.