16-11-2025 05:19:24 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆదివారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నారిశక్తి పోలీస్ షీ టీం మహిళా పోలీసులు పోలీస్ అక్క కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులతో కలిసి షీ టీం నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు పాల్గొన్నారు.