16 April, 2026 | 9:44 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

మత్తు రహిత సమాజం కోసం ఉపాధ్యాయుడి జనచైతన్యం

16-11-2025 05:21 PM

చివ్వెంల: చివ్వెంల మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్‌లో ఈరోజు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల ప్రమాదాలను తెలియజేస్తూ వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్దిరాల మండలం గోరంట్ల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని నడిపించారు. యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలకు, రైతులకు, హమాలీలకు సందేశాలతో చైతన్యం కల్పించారు.

సెలవు దినాలను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా జాతరలు, ఉత్సవాలు, వారాంత సంతలు, రద్దీ ప్రాంతాలలో “నో డ్రగ్స్ – సేవ్ లైఫ్” అనే నినాదంతో తన సేవలను అందిస్తున్న ప్రభాకర్, విచిత్ర వేషధారణలో మైకు పట్టుకుని, ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ, కరపత్రాలు పంచుతూ ఐకెపి సెంటర్ అంతా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత లక్ష్యాలను ఏర్పరుచుకుని ప్రణాళికబద్ధంగా కష్టపడాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆయన పిలుపునిచ్చారు. “ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం” అనే సందేశంతో మత్తు రహిత సమాజ స్థాపన కోసం తన వంతు కృషి చేయాలని ప్రజలను కోరారు. ప్రభాకర్ నిర్వహించిన ఈ అవగాహన యాత్ర స్థానికుల ప్రశంసలను పొందింది.