22 June, 2026 | 3:20 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

రామాయంపేటలో పోలీసుల రక్తదాన శిబిరం

28-10-2025 12:35 AM

రామాయంపేట, అక్టోబర్ 27 :రామాయంపేట పోలీస్ స్టేషన్ లో పోలీసు అమ రవీరుల వారోత్సవాలలో భాగంగా సోమవారం లయన్స్ క్లబ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంక టరాజా గౌడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం మహాదానమని, ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తం ప్రాణదానం అవుతుందని, పోలీసు అమరవీరుల స్మరణలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శం అన్నారు. ఈ సందర్భంగా సీఐ వెంకటరాజా గౌడ్, ఎస్త్స్ర బాల రాజ్, నిజాంపేట ఎస్త్స్ర రాజేష్, నార్సింగ్ ఎస్త్స్ర సృజన, పోలీస్ సిబ్బంది, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.