12-06-2025 11:28:05 PM
కొండపాక: గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసిన కేసును 48 గంటల్లో చేదించి, నిందితులను అరెస్టు చేసిన త్రీ టౌన్ పోలీసులు. త్రీ టౌన్ పోలీసులను సిద్దిపేట ఏసీపి రవీందర్ రెడ్డి(ACP Ravinder Reddy) అభినందించారు. త్రీ టౌన్ సిఐ విద్యాసాగర్ తెలిపిన కథనం మేరకు పోచమ్మ గుడి, కోటిలింగాల గుడి సిద్దిపేటకు చెందిన బోదాసు శ్రీదేవి, రత్నాపూర్ గ్రామం రామగిరి మండలం పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇట్టవేన సతీష్(30) వీరు ఇరువురు సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గర ఒక కల్లు దుకాణంలో కలుసుకొని పరిచయం ఏర్పడింది. రెగ్యులర్గా కలుసుకొని కల్లు తాగేవారు అది కాస్త వారి మధ్య అనుబంధంగా ఏర్పడింది.
అదే క్రమంలో పెద్ద మాసంపల్లి గ్రామం, తొగుట మండలంకు చెందిన బోదాసు నర్సింహులు(40) శ్రీదేవికి పరిచయమయ్యారు. శ్రీదేవి వెంట తిరిగేవాడు. సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గర వరలక్ష్మీ బార్లు శ్రీదేవి, సతీష్ మందు తాగుతుండగా సతీష్ శ్రీదేవిని పెళ్లి చేసుకుంటానని చెప్పగా శ్రీదేవి నాకు ఇష్టమే అని ఒప్పుకుంది. మృతుడు నరసింహులు శ్రీదేవి వెంట పడుతున్నాడు. శ్రీదేవి, సతీష్ బంధానికి అడ్డుగా ఉన్నాడని అతడిని ఎలాగైనా చంపేస్తా అనుకున్నారు. పక్కగా ప్లాన్ ప్రకారం తేదీ 07-06-2025 శనివారం రోజు రాత్రి సమయంలో సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గర బోదాసు నర్సింలు శ్రీదేవిని కలిసి కళ్ళు తాగుదామని అనగా సమయం కోసం ఎదురుచూస్తున్న ఆమెకు అనుకున్న విధంగా అదే సమయానికి సతీష్ కూడా రాగా నర్సింలు అనే వ్యక్తి ఇతనే అని చెప్పి ఈరోజు ఎలాగైనా నర్సింలను అడ్డు తొలగించాలని చెప్పింది.
శ్రీదేవి నర్సింలకు రంగధాంపల్లిలో దావత్ ఉన్నదని చెప్పి ముగ్గురు కలిసి ఆటోలో బయలుదేరి రంగదాంపల్లి వైన్స్ దగ్గరికి వెళ్లి రాత్రి ఆటో దిగి, నర్సింలుకు సతీష్ డబ్బులు ఇచ్చి మద్యం తెమ్మని చెప్పగా మయూరి బార్ అండ్ రెస్టారెంట్ వెనకాల ముగ్గురు కలిసి మద్యం సేవించారు. వారు అనుకున్న ప్రకారం నరసింహులు తో గొడవపడి సతీష్ నర్సింహులు చేతులతో చాతిపై పిడుగుద్దులు గుద్దుతూ, ముఖంపై తల వెనుక భాగంలో కొట్టగా నర్సింలు అక్కడికక్కడే చనిపోయాడు. నిందితులిద్దరిని 24 గంటల్లో పట్టుకొని, అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపామని త్రి టౌన్ సిఐ విద్యాసాగర్ తెలిపారు. కేసును చేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిద్దిపేట త్రీ టౌన్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ న, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ గౌడ్, వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి కేసును 24 గంటలలో చేదించిన పోలీసు సిబ్బందిని సిద్దిపేట ఏసిపి రవీందర్ రెడ్డి అభినందించారు.