25-10-2025 02:52:00 PM
ఇల్లెందు, (విజయక్రాంతి): డ్రగ్స్ నివారణకై పోలీస్ శాఖ చేపట్టిన చైతన్య యుద్ధంలో భాగంగా విద్యార్థులతో ఇల్లెందు పట్టణంలో శనివారం పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని జగదాంబ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా విద్యార్థులు పోలీసులు డ్రగ్స్ సేవించడం విక్రయించడం చట్ట రీత్యా నేరం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ర్యాలీలో ఇల్లెందు డీఎస్పీ ఎన్ చంద్రబాను, సీఐ తాటిపాముల సురేష్, ఎస్సైలు సూర్య, హసీనా విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు యువత డ్రగ్స్ నివారణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. యువత విద్యార్థులు డ్రగ్స్ డ్రగ్స్ పై చుట్టుపక్కల ప్రజలకు అవగాహన కల్పించి డ్రగ్స్ రహిత తెలంగాణకు కృషి చేయాలని సూచించారు.