శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి
27-12-2025 07:02 PM
- ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్
సిద్దిపేట క్రైం: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్ సూచించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం స్థానిక పరేడ్ గ్రౌండ్స్లో పోలీస్ పరేడ్ను నిర్వహించారు. పరేడ్ను పర్యవేక్షించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం అత్యంత ప్రధానమని పేర్కొన్నారు.
విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నిరంతర సాధన అవసరమని సూచించారు. ప్రజలకు చేరువగా ఉంటూ, తక్షణ సహాయం అందించడంలో ముందుండాలన్నారు. ఈ పరేడ్లో సిద్దిపేట టౌన్, ట్రాఫిక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.




