27-12-2025 06:59:28 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన అధికారిని డాక్టర్ సుమలత అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండలంలో కళావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్షయ వ్యాధిగ్రస్తుల పోషణ కిట్లు పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లాలో కళావతి ఫౌండేషన్ చైర్మన్ అశోక్ క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక కృషి చేయడం అభినందనీయం నియమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాయన్నతో పాటు వైద్య సిబ్బంది, క్షయ వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు.