వ్యభిచార కేంద్రంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్
సనత్నగర్, మార్చి ౩౦ (విజయక్రాంతి): హైదరాబాద్లోని ఎస్.ఆర్.నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వ్యభిచార కేంద్రంపై పోలీసులు దాడి నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం బి.కె.గూడ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతున్నట్లు నమ్మదగిన సమాచారం ఎస్.ఆర్.నగర్ పోలీసులకు అందింది.
దీంతో పోలీసులు చేసిన దాడిలో ప్రధాన నిందితుడు బైరెడ్డి రమేష్రెడ్డి (45), సబ్ ఆర్గనైజర్ తుత్తూరు వంశీ (24), కస్టమర్ గంకిడి లక్ష్మణ్ (45)లను అదుపులోకి తీసుకున్నారు. వీరు మధ్యవర్తుల సహాయంతో మహిళలను సమకూర్చి డబ్బుల కోసం వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనలో బెంగళూరుకు చెందిన మరియం (25), అంజనా దాస్ (18) అనే ఇద్దరు మహిళలను పోలీసులు రక్షించారు. ఈ వ్యవహారంలో చైతన్య అనే సప్లయర్ పరారీలో ఉన్నాడు. దాడి సమయంలో మూడు మొబైల్ ఫోన్లు, రూ.2,150 నగదు, యాక్టివా ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్.ఆర్. నగర్ పోలీసులు వెల్లడించారు.




