30-06-2025 12:21:02 AM
వేములపల్లి, జూన్ 29 : చెరువుల పరిరక్షణలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. కళ్ళముందే చెరువులు కబ్జా అవుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాగు, తాగునీటి అవసరాలు తీర్చే చెరువులు కబ్జాల పాలవుతున్నాయి. ఏటా వేసవిలో చాలా చోట్ల మట్టితో పూడ్చి అక్రమణలకు గురవుతున్నాయి. గ్రామ శివారులో ఉన్న చెరువుల విస్తీర్ణం కుచించిపోతుంది.
మండలంలో 12 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 12 గ్రామపంచాయతీలో 13 చెరువులు ఉన్నాయి. చెరువుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది . శిఖం భూములు ఎఫ్ టి ఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) దాటి పోయి చెరువు చెరువు గర్భం వరకు ఆక్రమించిన ఆనవాళ్లు ఉన్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు కబ్జాకు చేరువలో ఉన్నట్లు గ్రామాల్లోని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏటేటా వాగులు చెరువులు పరివాహక ప్రాంతాల విస్తీర్ణం తగ్గుతూ వస్తున్నాయి.
మండలంలోని చెరువుల పరిస్థితి
వేములపల్లి మండలంలో 12 గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 13 చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో 17 45.42 ఎకరాలకు పంట సాగు చేసుకోవడానికి నీరును అందిస్తున్నాయి. చెరువుల విస్తీర్ణం తగ్గిపోవడం, కట్టలు తూములు, కాలువలు సరిగ్గా లేకపోవడం ఆయకట్టు పూర్తిస్థాయిలో సాగు కావడం లేదు. కామేపల్లిగూడెం గ్రామంలో సర్వేనెంబర్ 45/ a చెరువు 186.32 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఈ చెరువు పరిధిలో 133. 20 ఎకరాల ఆయకట్టు ఉంది.
రావులపెంట గ్రామంలో సర్వేనెంబర్ 14/ఆ 180 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉన్నది. దీని కింద 337.23 ఎకరాల సాగు విస్తీర్ణం అవుతున్నది. వేములపల్లి గ్రామంలోని చిన్న చెరువు సర్వే నెంబర్ 30 లో 356.24 ఎకరాల విస్తీర్ణంలో కలదు. దీని కింద 178.03 సాగు సాగు అవుతున్న భూములు కలవు.
వేములపల్లి గ్రామంలోని పెద్ద చెరువు సర్వే నెంబర్ 642 643/R,644/R,645/R లో 221.37 ఎకరాల విస్తీర్ణంలో కలదు దీని కింద 403.06 ఎకరాల విస్తీర్ణంలో భూమి సాగు అవుతున్నది. ఆమనగల్లు గ్రామంలో సర్వేనెంబర్ 770, 718, 690,695 లో 452.21 విస్తీర్ణంలో చెరువు కలదు. ఈ చెరువు కింద 439.15 ఎకరాల భూమి సాగు అవుతున్నది. అన్నపరెడ్డిగూడెం గ్రామం లో సర్వేనెంబర్ 120 లో 33.27 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉన్నది.
దీని పరిసరా ప్రాంతంలో 24.76 ఎకరాల వ్యవసాయం సాగు అవుతుంది. మంగాపురం / సల్కునూరు గ్రామపంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 338 లో 70.33 ఎకరాల విస్తీర్ణంలో చెరువు కలదు. దీని కింద 41. 36 ఎకరాల్లో నీరు అందుతున్నది. మొల్కపట్నం గ్రామపంచాయతీ పరిధిలోగల సర్వే నెంబర్ 25.0 లో 17 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఈ చెరువు కింద 51.59 ఎకరాల్లో పంట సాగు అవుతున్నది.
సల్కునూరు గ్రామంలో సర్వేనెంబర్ 391లో 48.16 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. దీని కింద 64.8 6 ఎకరాల్లో నీరు అందుతున్నది. శెట్టిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 52 లో 121.2 4 ఎకరాల్లో చెరువు విస్తరించి ఉంది .దీని కింద 40.15 ఎకరాల్లో పంట సాగుకు నీరందుతున్నది . తిమ్మిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో 64 సర్వే నెంబర్లు 5.27 ఎకరాల విస్తీర్ణంలో చెరువు కలదు.
దీని కింద 32.0 ఎకరాలకు సాగునీరు అందుతుంది. శెట్టిపాలెం గ్రామంలోని రూపా దేవి కుంట అని పిలవబడే చెరువు సర్వే నెంబర్ 02 లో 20.29 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది .అదే విధంగా శెట్టిపాలెం గ్రామంలోని ముండ్లపాడు కుంట అని పిలిచే చెరువు సర్వే నెంబర్ 142లో ఉన్నది .
దీని విస్తీర్ణం 21.3 ఎకరాల్లో కలదు. మండలంలోని 13 చెరువులు కబ్జాకు గురై సాగునీటి ఎద్దడితోపాటు భూగర్భ జలాలకు సైతం తగ్గిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులను కబ్జానించి కాపాడి ప్రజలకు నీటి వనరులు దక్కేన చూడాలని కోరుతున్నారు.
చెరువు శిఖం భూములను కబ్జాకు గురి చేస్తే చర్యలు తప్పవు
ప్రభుత్వం నిర్దేశించిన ఎకరాలలో చెరువులు తప్పనిసరిగా ఉండాలి. చెరువుల పక్కన ఉన్న రైతులు ఎవరైనా చెరువులు కబ్జా చేసినట్లు రుజువైతే చర్యలు తీసుకొని చెరువు శిఖం లో కబ్జాకు గురైన భూమిని కలిపేస్తాం. అదేవిధంగా కబ్జా చేసిన రైతులకు నోటీసులు పంపించి కేసులు నమోదు చేస్తాం.
- ఏ ఈ సాయి రెడ్డి