30-06-2025 12:19:08 AM
ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ జూన్ 29 : నియోజకవర్గ అభివృద్ధిలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఉత్తమ్ పద్మావతి నగర్ లో ఎస్డిఎఫ్ నిధులు ఆరు లక్షల రూపాయలతో సిసి రోడ్డును ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధిలో ఎక్కడ వెనకడుగు వేయడం లేదని గ్రామాలలో నాయకులు అభివృద్ధి కోసం నిధులు అడిగిన వెంటనే మంజూరు చేస్తానన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో స్థానాలు కైవసం చేసుకుంటుందని కార్యకర్తలు నాయకుల సంసిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, టిపిసిసి డెలికేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవెల్లి బాల్రెడ్డి, తునం కృష్ణ,మంగయ్య, కొంపల్లి శ్రీను, మానేపల్లి పాపారావు, నరసరాజు, తుమాటి నాగిరెడ్డి, సుందరీ వెంకటేశ్వర్లు, షరీఫ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.