16 April, 2026 | 12:02 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

తపాలా ఉద్యోగులవి అత్యుత్తమ సేవలు..

10-10-2024 06:28 PM

20 మంది తపాలా ఉద్యోగులకు ఘన సన్మానం

కరీంనగర్, (విజయక్రాంతి): తపాలా శాఖ ఉద్యోగులు ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ప్రతినిధులు పేర్కొన్నారు. జాతీయ తపాలా శాఖ వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం కరీంనగర్ లోని పోస్ట్ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ లో 20 మంది తపాలా శాఖ ఉద్యోగులను లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ప్రతినిధులు మాట్లాడుతూ.. తపాలా శాఖ ఉద్యోగులు బాధ్యతా యుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లవేళలా సేవలందిస్తూ ఆ శాఖకే మంచి పేరు తెస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షుడు ముక్క శరత్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి మ్యాడం శివకాంత్, కోశాధికారి బట్టు వినోద్, ఆర్సీ కొండా రాంబాబు, ప్రోగ్రాం చైర్మన్ లయన్ సింగమరాజు, రాచకొండ సంతోష్, ప్రతినిధులు ,తదితరులు పాల్గొన్నారు.