విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

01-05-2024 12:25:40 AM

ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి

హనుమకొండ, ఏప్రిల్ 30 (విజయక్రాం తి): నేటి(బుధవారం) నుంచి నిర్వహించనున్న విద్యుత్ భద్రతా వారోత్సవాలను జయప్రదం చేయాలని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి కోరారు. హనుమకొండ కార్యాలయంలో మంగళవారం భద్రతా వారోత్సవాల వాల్ పోస్టర్లు, కరపత్రాలు, బుక్‌లెట్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి డివిజన్, సబ్ డివిజన్లలో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ భద్రత ప్రాముఖ్యతను వివరించి ప్రమాదాలు నివారించేందుకు కృషి చేయాలని చెప్పారు. అలాగే కరపత్రా లు పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డైరెక్టర్లు అశోక్‌కుమార్, మోహన్‌రావు, సదర్‌లాల్, తిరుపతిరెడ్డి, సీజీఎంలు మధుసూదన్, ప్రభాకర్, కిషన్, రాజుచౌహాన్, అశోక్, రవీంద్రనాథ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.