వరంగల్ తూర్పు, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ఏనుమాముల మార్కెట్ ఉన్నత శ్రేణి అదనపు కార్యదర్శిగా జమ్మికుంట మార్కెట్ కార్యదర్శి గుగులోతు రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో విధులు నిర్వహించిన సంగయ్య పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో బాధ్య తలు చేపట్టారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు పలువురు మార్కెటింగ్ ఉద్యోగులు, యూనియన్ల నాయకులు అభినందనలు తెలిపారు.