17-02-2026 12:00:00 AM
సూర్యాపేట, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి) : పట్టణంలోని గిరి నగర్, ఈనాడు ఆఫీస్, ఈనాడు ఆఫీస్ ఎదురుగా, హనుమాన్ నగర్, శాంతినగర్, దాసాయిగూడెం రోడ్డు, ఇండస్ట్రియల్ ఏరియా, భజన తండా, నేత్య తండా, పాండ్యా నాయక్ తండ, దుబ్బ తండ ప్రాంతాలలో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా నేటి మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు ఏఈ సురేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు విషయంను గ్రహించి సహకరించాలన్నారు.