09-06-2025 01:31:34 AM
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావు ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకు న్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014--23 మధ్య రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపా రవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్చేసినట్లు వచ్చిన ఆరోపణలపై 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రభాకర్రావుపై కేసు నమోదైంది.
ఆ మరుసటిరోజే 3 నెలల కాలపరిమితి వీసాతో అమెరికాకు వెళ్లి తిరిగి రాలేదు. మే 29న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు..ప్రభాకర్రావుకు వన్-టైమ్ ట్రావెల్ పర్మి ట్ జారీచేస్తూ, మూడు రోజుల్లో భారత్కు తిరిగి రావాలని, విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఈమేరకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ (ఈసీ- అత్యవసర పత్రం) జారీ కాగా..ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.
అయితే విచారణ పూర్తయ్యేవరకు అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు తె లంగాణ పోలీసులకు సూచించింది. గతంలో ప్రభాకర్రావు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ తిర స్కరణకు గురైంది. దీంతో సుప్రీంకోర్టును సంప్రదించారు. కాగా ప్రభా కర్రావు సోమవారం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ముందు విచా రణకు హాజరుకానున్నారు.
ఈ కేసు లో ఇప్పటికే అదనపు ఎస్పీలు భుజంగరావు, రాధాకిషన్రావు, తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్రావు అరెస్టు కాగా..మరో నిందితుడు అ రువుల శ్రవణ్రావు పరారీలో ఉన్నా రు. తెలంగాణ పోలీసులు ఇంటర్పోల్ సహాయంతో రెడ్కార్నర్ నో టీస్ జారీచేసి, అమెరికా నుంచి ప్రభాకర్రావును రప్పించేందుకు అ న్ని ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభాకర్రావు విచారణతో కేసులో కీలక విషయాలు, పెద్దల పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.