నేడు కలెక్టరేట్లో ప్రజా వాణి తాత్కాలికంగా వాయిదా
16-03-2026 12:00 AM
కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్ మార్చి 15(విజయ క్రాంతి) : జిల్లా లో జనాభా గణన2027 సమర్థంగా నిర్వహించేందుకు వారికి కేటాయించిన విధులలో అధికారులు నిమగ్నమై ఉన్నందున నేడు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మండల స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలి కంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




