25 July, 2026 | 10:35 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి

02-06-2024 01:10 AM

ముందస్తు బెయిల్ తిరస్కరించిన కోర్టు

బెంగళూరు, జూన్ 1 : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆయన తల్లి భవానీ రేవణ్ణ పరారీలో ఉన్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఇంటి పనిమనిషి కిడ్నాప్ ఘటనలో భర్త రేవణ్ణతో పాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వినిపించాయి. దీంతో ఆమెను విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు పంపారు. శనివారం ఇంటికి వచ్చి ప్రశ్నిస్తామని నోటీసులలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సిట్ అధికారులు హోళెనరసీపురలోని ఆమె నివాసానికి వెళ్లగా ఆమె కనిపించలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చిందని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఆమె పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. ఈ కేసులో ఆమె ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా బెంగళూరు కోర్టు దాన్ని తిరస్కరించింది. కాగా, మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం లో దిగిన వెంటనే అరెస్ట్ అయిన సంగ తి తెలిసిందే. విచారణ నిమిత్తం కోర్టు ఆయనను 6 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగించింది. అయితే, ప్రజ్వల్‌ను అరెస్ట్ చేసిన వారందరూ మహిళా పోలీసులే కావడం గమనార్హం.