18-06-2025 01:25:11 PM
హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో సిట్ విచారణ(SIT Inquiry) కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించి అరెస్టు చేసిన సిట్.. వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్ రావు(Praneeth Rao) బుధవారం సిట్ విచారణకు హాజరయ్యారు.
ఎన్నికల ముందు ఎస్ఐబీలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ను లీడ్ చేసిన ప్రణీత్ రావు రాజకీయ నేతలు, ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేశాడు. ప్రభాకర్ రావు ఆదేశాలతో హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి నాగోల్ వద్ద మూసీ నదిలో పడేసినట్లు ప్రణీత్ రావు సిట్ అధికారులకు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డితో పాటు మిగిలిన సాక్షుల వాంగ్మూలాలను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న జుబ్లీహిల్స్ లోని సిట్ అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చారు.