12-01-2026 12:18:07 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి11: రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషా, పద్మిని, ఛాయా సమేత సూర్యనారాయణుడిని ప్రత్యేకంగా అలంకరించి, అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌర హోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు జరిపారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీర హనుమాన్, శ్రీ రామకోటి స్తూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్ధన్ స్వామి, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్ పాండే, భక్తులు పాల్గొన్నారు.