calender_icon.png 26 June, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

26-06-2025 01:04:33 AM

ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ 

కామారెడ్డి, జూన్ 25,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం తాగునీటి పైపులు చెడిపోయినందున దాని మరమ్మతులు చేపించారు. ఈ విషయమై ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సందర్శించి వర్షాకాలం ను దృష్టి లో పెట్టుకొని పైప్ లైన్లు ఎక్కడ లీకేజీ కాకుండా తాగునీటి కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శి ని ఆదేశించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలించారు.