మహాత్మా జ్యోతిబాఫూలే డా.బీఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణపై సన్నాహక సమావేశం
09-04-2026 12:26 AM
సత్తుపల్లి, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): ఈ మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన జీఎం వేడుకల పర్యవేక్షణ కోసం సంబంధిత లైజన్ ఆఫీసర్లు మరియు యూనియన్ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ఏజీఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, ఎస్ఓ టు జీఎం బొల్లం శ్రీనివాస్, ఏరియా ఇంజనీర్ కె. సోమశేఖర రావు, ఎస్ఈ (సివిల్) ఏ. రవి కుమార్, బీసీ లైజన్ ఆఫీసర్ బుడగం రామకృష్ణ, సంక్షేమ అధికారులు, ఎస్సీ/ఎస్టీ లైజన్ ఆఫీసర్లు, ఇతర అధికారులు మరియు యూనియన్ ప్రతినిధులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్ణయించారు.




