28-05-2025 01:09:51 AM
ఆంధ్రప్రదేశ్లోని సినిమా హాళ్లను పకడ్బందీగా చేపట్టి, ప్రేక్షకులకు మెరుగైన సేవ లు అందించాలని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమం త్రి, సినీ నటుడు పవన్కల్యాణ్ స్పష్టం చేశా రు. ఇటీవల సినిమా హాళ్ల బంద్ ప్రకటన నేపథ్యంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఆ శాఖ సూచనల మేరకు పవన్క ల్యాణ్ స్పందించారు. కొత్త సినిమాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపునకు నిర్మాతలు వ్యక్తిగతంగా కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చే యాలని సూచించారు.
ప్రభుత్వ శాఖలు త మ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా అమ లు చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే ‘హరిహరవీరమల్లు’ సిని మాకు సైతం నిర్మాత చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారా నే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని, ఇందులో ఎలాంటి భేదాలూ పా టించవద్దని స్పష్టంగా చెప్పారు.
తినుబండారాల ధరలపై ఓ కన్నేయండి
టికెట్ ధరల కంటే సినిమా హాల్లో తినుబండారాలలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై ఈ సందర్భంగా చర్చించారు. వాటి వాస్తవ ధరలు.. ప్రస్తుతం విక్రయిస్తున్న ధరల్లో తేడాలు, వాటి నాణ్యతా ప్ర మాణాలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, ధరల నియంత్రణ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
తినుబండారాల వ్యాపారం విషయంలో అన్ని థియేటర్లలోనూ గుత్తాధిపత్యం సాగుతోందన్న విష యం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ మంత్రికి సూచించారు.
తినుబండారాలు, పానీయాల ధరల కారణంగానే ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా ఉండే పరిస్థితి ఉండొద్దని అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరిగి, పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయం మెరుగవుతుందన్నారు. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలని పవన్కల్యాణ్ సూచించారు.
బంద్ ప్రకటన కారణాలను అన్వేషించాలి
సినిమా రంగంలో గందరగోళ పరిస్థితులకు కారణమైన బంద్ ప్రకటన వెనుక గల కారణాలను తెలుసుకోవాలని ఈ సందర్భంగా పవన్కల్యాణ్ సూచించారు. ఇందు కు ముఖ్య కారకుల్లో జనసేన వాళ్లు ఉన్నా చర్యలకు వెనుకడుగు వేయవద్దని స్పష్టంచేశారు.
బెదిరింపులకు పాల్పడుతూ వ్యాపారా లు సాగించాలనుకునే అనారోగ్యకర వాతావరణానికి తావు ఇవ్వొద్దన్నారు. సినిమా వ్యాపారం సజావుగా సాగేలా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాలని ఉప ముఖ్యమం త్రి పవన్కల్యాణ్ స్పష్టం చేశారు.