18 April, 2026 | 12:17 PM

Breaking News

హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •   మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి   •  

శోభనకు పద్మభూషణ్

28-05-2025 01:10 AM

రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం కనుల పండువగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ప్రదానం చేశారు. మొదటి విడత అవార్డులను అందుకున్నవారిలో తెలుగు చిత్రసీమ నుంచి నందమూరి బాలకృష్ణ ఉన్నారు.

తాజాగా మరికొందరికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సినీనటి డాక్టర్ శోభన చంద్రకుమార్‌తో పాటు కన్నడ నటుడు అనంత్ నాగ్ పద్మభూషణ్ అందుకున్నారు. శో భన కళారంగంలో చేసిన సేవలను గుర్తిస్తూ పద్మభూషణ్ అవార్డును అందజేశారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు ఐకాన్‌గా ఉన్న డాక్టర్ శోభన ఆరు భారతీయ భాషల్లో 230కిపైగా చలనచిత్రాల్లో నటించారు. ఆమె తన భరతనాట్యం ద్వారా సినిమాలకు మరింత వన్నె తెచ్చారు.