11 July, 2026 | 9:38 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

24-09-2025 12:33 AM

రాజాపూర్, సెప్టెంబర్ 23: పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశమని బిజెపి మండల అధ్యక్షుడు ఆనంద్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జీఎస్టీ ధరలు భారతదేశం అన్నిరకాల వస్తువుల ధరలు తగ్గించడం,తగ్గిన ధరలు సోమవారం నుండి అందరికీ అందుబాటులోకి రావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రధాని దసరా కానుకగా పేదా మధ్యతరగతి ప్రజలకు నిత్యవసర వస్తువులు,ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు,కంప్యూటర్లు, ఇలా ప్రతి దాని పైన కూడా ధరలు తగ్గించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ధరలు పేరుదల పై ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ పైన బురదజల్లే కార్యక్రమం చేశారు. నిత్యవసర వస్తువులు తగ్గించినందుకు ఇది చూసైనా ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ పైన ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నర్సింలు,శేఖర్,రాజు,గంగాధర్ గౌడ్, ఆదిత్య, బాలరాజ్, నర్సింహా,తదితరులు పాల్గొన్నారు.