25-09-2025 03:21:58 PM
8 మందికి తీవ్ర గాయాలు
డిచ్పల్లి : (విజయ క్రాంతి) డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారి (ఎన్ హెచ్ 44) పై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఫలితంగా బస్సులో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పై నిర్లక్ష్యంగా లారీని నిలిపించడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది నిర్మల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సు సుద్దపల్లి గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అజాగ్రత్త నడపడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు నాకు తెలుస్తోంది. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న డిచ్పల్లి ఎస్సై షరీఫ్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించిన్నట్లు ఎస్సై తెలిపారు.