25 July, 2026 | 7:06 AM

కోనరావుపేటలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓట్ చోరీ అవగాహన కార్యక్రమం

25-09-2025 03:19 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోనరావుపేట మండల కేంద్రంలోని బూత్ నంబర్లు 237, 239లో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో వోట్ చోరీ నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఓటు విలువైనదని, వోట్లు దొంగిలించే చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు నిత్యానందం, సందీప్, సృజన్, జెలంధర్, శ్రీనివాస్, జనార్ధన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.