03-12-2025 12:13:19 AM
ఏబీవీపీ గాంధారి శాఖ డిమాండ్
గాంధారి, డిసెంబర్ 2 (విజయ క్రాంతి ): గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు మంగళవారం రోజున వినతిపత్రం అందించిన అనంతరం కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని,
మూత్రశాలలో అపరిశుభ్రంగా ఉండటం వల్ల విద్యార్థులు అందరం బయటకి వెళ్లసిన పరిస్థితి అదే విధంగా తరగతి గదులు కూడా శుభ్రంగా లేక పోవడం, త్రాగునీరు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఈల చాలా సమస్యలు ఎదుర్కుంటున్నము చాలామంది విద్యార్థులు కూడా కలశాలకు రాన్నటువంటి పరిస్థితి దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కళాశాల కార్యదర్శి నవాజ్ కార్యకర్తలు సందీప్ , వినోద్, సౌమ్య, స్నేహ, భవాని పాల్గోన్నారు.