20 March, 2026 | 6:27 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఇందిరమ్మ ఇండ్లలో ప్రగతి కనిపించాలి

19-07-2025 12:00 AM

 జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి, జూలై 18(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు కృషి చేయాలి, నిర్మాణపు పనులు  త్వరగా పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులకు, లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం వట్పల్లి మండలం దేవనూరు గ్రామంలో బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణంలో ఉన్న    ఇందిరమ్మ ఇండ్లను  జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు.  ఇందిరమ్మ ఇండ్లు ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత త్వరగా బిల్లులు లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆర్డీవో పాండు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

వట్పల్లి మండలం సాహేద్ నగర్ గ్రామంలో డిజిటల్ రీ సర్వే కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వట్టిపల్లి మండలం, సాహేద్ నగర్ గ్రామంలో జరుగుతున్న డిజిటల్ రీ సర్వే  కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు.  కార్యక్రమంలో సర్వే ల్యాండ్  రికారడ్స్ సహాయ సంచాలకులు ఐనే ష్, ఆర్డీవో పాండు,  రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు.