24-06-2025 12:01:07 AM
మణుగూరు, జూన్ 23 ( విజయ క్రాంతి) : సింగరేణి ఓసి ఉపరితల గనులతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని , గ్రామాలకు అతి సమీపంలో బ్లాస్టింగుల వల్ల ఇళ్లకు పగుళ్ళు, బీటలు వారుతున్నాయని, మరో వైపు బొగ్గు లారీల నుండి వేలువడే దుమ్ము ధూళి తో అనేక వ్యాధు లకు అనారోగ్యానికి గురి అవుతున్నా అటు సింగరేణి, ఇటు అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తు కోపోద్రిక్తులై న రాజుపేట, విఠల్ రావు నగర్ ,పీకే వన్ సెంటర్ గ్రామస్తులు సోమవారం ఆందోళన బాట పట్టారు.
గ్రామస్తులు భారీ ప్రదర్శన గా బయలుదేరి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.మా ప్రాణాలు పోయినా పట్టించుకోరా అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.సింగరేణి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని హెచ్చరించారు.
ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు తమకు అండగా నిలవాలని కోరారు.గ్రామాలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి,తమకు ఉపాధి కలిపించాలని డిమాండ్ చేశారు.మల్లెపల్లి ఓసి కట్ట ను తక్షణమే నిలిపి వేయాలన్నారు. తమ కు న్యాయం చేయాలని తాహల్దారు అద్దంకి నరేష్ కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజుపేట, విఠల్ రావు నగర్ ,పీకే వన్ సెంటర్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.