calender_icon.png 25 June, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడువు సమయంలో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలి

24-06-2025 12:00:00 AM

డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి

మునుగోడు, జూన్ 23 : గడువు సమయంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వం అందించే ఐదు లక్షల రూపాయల లబ్ధిని పొందాలని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుమ్మం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదు లక్షల రూపాయల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గంగూరి గూడెం కచలాపురం రావి గూడెం గ్రామాలలో  మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  ఆదేశాల మేరకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.

పేదవారి ఇంటి నిర్మాణ పలను సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని,ప్రతి పేదవారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ,మండల కాంగ్రెస్ అధ్యక్షులు భీమనపల్లి సైదులు.,ఎంపీడీవో విజయభాస్కర్,  కచలాపురం మాజీ రామచంద్రం,రామ్ రెడ్డి,గోపాగొని  పాపయ్య,శ్రవణ్. గణేష్,అశోక్,స్వామి,వెంకన్న,శవగొని మహేష్,గోపగోని మహేష్,గోపగోని స్వామి,గోపగోని బాలరాజ్ ఉన్నారు.