15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బిఆర్ఎస్ శ్రేణుల నిరసన

01-02-2026 05:42 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ  ములకలపల్లి మండల వ్యాప్తంగా ఆదివారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. మండల వ్యాప్తంగా అన్ని పంచాయితీలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారులపై చేరుకొని రాస్తారోకోలు నిర్వహించారు.

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేసీఆర్ కుటుంబాన్ని ఎలాగైనా బదనాం చేయాలనే ఒక కక్షపూరితమైన రాజకీయ క్రీడను అవలంబిస్తూ ప్రభుత్వం కాలం గడుపుతోందని ఆరోపించారు.కక్ష రాజకీయాలకు స్వస్తి పలికి  ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.