19 May, 2026 | 11:25 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

ఎమ్మెల్యే సార్.. డంపింగ్ యార్డ్ మాకొద్దు

21-01-2026 12:01 AM

తుంగతుర్తి, జనవరి 20: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో గడిచిన 50 సంవత్సరాల క్రితం నుండి పేద దళితులు జాతీయ రహదారి పక్కన గల సర్వేనెంబర్ 10 ,11 లో గల భూమిని నిరుపేదలైన దళితులు కొంతమంది వ్యవసాయం చేస్తూ మరి కొంతమంది గోర్లు, మేకలు, బర్లను మేపుతూ జీవనోపాధి సాగిస్తున్నారు. గ్రామంలో కొంతమంది ఓర్వక, అధికారులతో కుమ్మక్కై భూములలో నూతనంగా డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులు చేపట్టారు.

కావున మాయందు దయవుంచి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, పేద దళితుల విజ్ఞప్తి మేరకు చెత్త డంపింగ్ యార్డుతో  గ్రామస్తులకు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కావున డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. లేనియెడల అధికారుల తీరుపై మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మట్టిపల్లి శ్రీశైలం యాదవ్, వార్డు సభ్యులు కాసర్ల ఉప్పలయ్య కంచం సందీప్, వగలగాని రాము, మట్టిపల్లి ప్రవీణ్ కుమార్, గ్రామస్తులు మల్లెపాక శ్రీను, మల్లపాక చంటి, కాసర్ల రాకేష్, నకిరేకంటి నాగేశ్వరరావు, కామ యాదయ్య, వగలగాని కృష్ణ పాల్గొన్నారు.