9 April, 2026 | 9:28 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

వాగ్మారే గౌతం కుటుంబానికి న్యాయం చేయాలి..

27-10-2025 08:00 PM

దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన..

ఇంద్రవెల్లి (విజయక్రాంతి): అటవీ శాఖ అధికారుల వేధింపుల వల్లే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఉట్నూర్ మండలంలోని గొట్టిపటార్ గ్రామానికి చెందిన వాగ్మారే గౌతం కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దళితుని మృతికి కారణమైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాథోడ్ విజయలక్ష్మీని విధుల నుండి తొలగించాలని సోమవారం  ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనం నుండి ఫారెస్ట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గౌతం కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలతో హోరెత్తించారు.

దళిత సంఘాల నాయకులు గౌతం కుటుంబానికి రూ.20 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల ఫారెస్ట్ అధికారి సంతోష్ మృతుని తండ్రితో పాటు దళిత సంఘాల నాయకులతో మాట్లాడారు. అప్పటికి ఆందోళనకారులు శాంతించకపోవడంతో అనంతరం దళిత సంఘాల నాయకులతో డీఎఫ్ఓతో ఫోన్ లో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో దళిత సంఘాల నాయకులు శాంతించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు సోన్ కాంబ్లే జితేందర్, కాటం రమేశ్, దావుల రమేశ్, భారత్ సింగారే, దళిత సంఘాల పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.