27 July, 2026 | 6:55 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ఆర్థిక సహాయం అందజేత

23-02-2026 09:09 PM

విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సేకు వెంకటేశ్వర్లు దాతృత్వం

కోదాడ: కోదాడ మండల పరిధిలోని రెడ్లకుంట గ్రామానికి చెందిన నిరుద్యోగి పోలంపల్లి దాన వీర అనే యువకుడికి పట్టణానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సేకు వెంకటేశ్వర్లు వరలక్ష్మి దంపతులు సోమవారం రూ.10,116లు ఆర్థిక సాయం అందజేశారు. పాత ఆటో కొనుగోలు చేసుకొని, స్వయం ఉపాధి పొందే నిమిత్తం పోలంపల్లి దాన వీరకు ఆర్థిక సాయం అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ విద్యా సంస్థల సీఈవో ఎస్ఎస్ రావు, సేకు సాయిరాం, రమ్య , నాగ సంయుక్తరాణి పాల్గొన్నారు.