22-09-2025 08:00:30 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఇటీవలి భారీ వర్షాలతో నష్ట పోయిన వరద బాధితులకు పీఆర్టీయూ తెలంగాణ సంఘం నాయకులు అండగా నిలిచారు. జిల్లా శాఖ పిలుపు మేరకు కలెక్టర్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కోసం రూ.7,06,011 విరాళం సేకరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను కలిసి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సహాయ నిధికి నిధులు అందించిన పీఆర్టీయూ తెలంగాణ జిల్లా బాధ్యులను అభినందించారు. ఆపద సమయంలో ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలను మరిన్ని నిర్వహించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.